Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
Blogger Widgets Blogger Widgets

Friday, June 28, 2013

రాధికాస్వాంతనము




రాధికాస్వాంతనము

                           ముద్దు పళని










  •      శ్రీనాథుని కాలాని కంటే ముందు రాధ ప్రసక్తి తెలుగు సాహిత్యంలో లేదు.
  •     శ్రీనాథుడు తొలిసారిగా భీమఖండం అవతారికలో ఇష్టదేవతలను ప్రార్ధిస్తూ రాధామాధవులను ప్రస్తావించాడు.
  •     రాధికాస్వాంతనమునకు ఇళాదేవీయమని మరొక పేరు కలదు.
  •     రాధ చెప్పుచేతల్లో ఇళ పెరుగుతుంది.
  •      ఈ ప్రబంధంలో రాధ కృష్ణుడికి చిలుక రాయాబారం పంపుతుంది.

ఆశ్వాసం
ఆశ్వాసంలోని పద్యాల సంఖ్య
ప్రథమాశ్వాసం
౧౧౧ గద్య పద్యాలు ( 111)
ద్వితీయాశ్వాసం
౧౪౭ గద్య పద్యాలు ( 147)
తృతీయాశ్వాసం
౧౭౧ గద్య పద్యాలు ( 171)
చతుర్థాశ్వాసం
౧౧౩ గద్య పద్యాలు ( 113)
మొత్తం = ౪ ఆశ్వాసాలు ( 4)
మొత్తం = ౫౪౨ పద్యాలు ( 542)



తొలి పద్యం

ఉత్పలమాల (ఇష్ట దేవతా స్తుతి)



 “ శ్రీలఁ జెలంగు రాధికనుజెల్వరొ! నిన్నిల రూప రేఖలన్
      బోలుదురే పడంతు?’ లనమోహపురాలిని నిప్పుడెన్నెదో
          హాళిని నన్నుఁ గూర్చియని ల్గిన యిచ్చెలిఁ గౌగిలించు గో
 పాలుని, జిన్ని కృష్ణుని, గృపాశుని గొల్తు నభీష్ట సిద్ధికై.”





చివరి పద్యం

మత్తకోకిల.



 నాగ పాలక ! నాగ దాలక ! నాగ ఫాలక వాహనా !
    వా గధీశ్వర ! వా గహీశ్వర ! వా గనశ్వర గాహనా !
        యోగ చారణ ! యోగ ధారణ ! యోగ కారణ ! సాహనా
     భోగ శోషణ ! భోగినీషణ ! భోగి భూషణ మోహనా ! ”





Sunday, May 12, 2013

విజయ విలాసం


విజయ విలాసం
                     చేమకూర వేంకట కవి



  • చేమకూర వారి తండ్రి పేరు : - లక్ష్మన్న లేదా లక్ష్మణామాత్యుడు
  •   చేమకూర వారు సూర్యనారాయణ వరప్రసాద లబ్ధ కవితా ధురంధరుడు.

  •   విజయ విలాసానికి పిల్ల వసుచరిత్రఅని పేరు.

  •   విజయ విలాసంలో కథానాయకుడు “అర్జునుడు”.

  •   ధర్మ రాజు : - ఇంద్రప్రస్థపుర రాజు.

  •    జయంతుడు : - ఇంద్రుని కుమారుడు.

  •   విశారదుడు : - అర్జునుని స్నేహితుడైన ధౌమ్యుని తమ్ముని కుమారుడు.

  •   ఈ ప్రబంధం రఘునాథ నాయకునికి అంకితంగా ఇవ్వబడినది.

  •  ఈ ప్రబంధంలో ౩ ఆశ్వాసాలున్నాయి.

అర్జునుడికి గల ౧౦ పేర్లు
   1.      అర్జునుడు,
   2.      ఫల్గునుడు,
   3.      పార్ధుడు,
   4.      కిరీటి,
   5.      శ్వేతవాహనుడు,
   6.      బీభత్సుడు,
   7.      విజయుడు,
   8.      కృష్ణుడు,
   9.      సవ్యసాచి,
   10.  ధనుంజయుడు.


అర్జునుడి భార్యలు
అర్జునుడి కుమారులు
ఉలూచి
( నాగ కన్య )
ఇలావంతుడు
( ఉలూచి కుమారుడు )
చిత్రాంగద
( మణిపుర రాజధాని అగు పాండ్యదేశ రాజు
మలధ్వజుని కూతురు )
భభ్రువాహనుడు
( చిత్రాంగద కుమారుడు )

సుభద్ర
( శ్రీ కృష్ణుని చెల్లి )
అభిమన్యుడు
( సుభద్ర కుమారుడు )


ఆశ్వాసం
ఆశ్వాసంలోని పద్యాల సంఖ్య
అవతారిక
౬౫ గద్య పద్యాలు ( 65 )
ప్రథమాశ్వాసం
౧౬౩ గద్య పద్యాలు ( 163 )
ద్వితీయాశ్వాసం
౨౦౬ గద్య పద్యాలు ( 206 )
తృతీయాశ్వాసం
౨౩౯ గద్య పద్యాలు ( 239 )
మొత్తం = ౩ ఆశ్వాసాలు
మొత్తం = ౬౭౩ పద్యాలు ( 673 )




తొలి పద్యం


   శార్థూలం.


“ శ్రీ లెల్లప్పు డొసంగ, నీ సకల ధాత్రీ చక్రమున్ బాహు పీ
    ఠీ లగ్నంబుగఁ జేయ, దిగ్విజయ మీన్ డీకొన్న చందాన నే
       వేళన్ సీతయు, లక్ష్మణుండుఁ దను సేవింపంగ విల్ పూని చె
        ల్వౌ లీలన్ దగు రామమూర్తి రఘునా థాధీశ్వరుం బ్రోవుతన్”.





చంపకమాల.   (ప్రథమాశ్వాసంలోని ౨౭వ పద్యము(27))

    
    తని నుతింప శక్యమె జయంతుని తమ్ముడు సోయగమ్మునన్,
 తగ కులాధిప ధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్,
క్షితిధర కన్యకాధిపతికిన్ బ్రతి జోదు  సమిజ్జయమ్మునం,
తని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్”.
                                                                   

 





చివరి పద్యం


భుజంగ ప్రయాతము.
   
    “ అరాతీ క్షమాభృ ద్బిదాంచ త్కృపాణా !
రాధీశ్వ రాకార నాళీక బాణా !
     స్థిరానందనా ! రామ సేవా ధురీణా !
    విరాజ చ్చతుష్షష్టి విద్యా ప్రవీణా !”.





 

Wednesday, April 24, 2013

ప్రభావతీ ప్రద్యుమ్నము



ప్రభావతీ ప్రద్యుమ్నము

                    పింగళి సూరన


  •  రుక్మిణీ కృష్ణుల కుమారుడు ప్రద్యుమ్నుడు.
  •  ప్రద్యుమ్నుడు పూర్వ జన్మలో మన్మథుడు.
  •  శుచిముకి ( హంస ) తండ్రి పేరు సారంధరుడు.
  •   వజ్రనాభుడన్న రాక్షసరాజు కూతురు "ప్రభావతి".
  •   వజ్రనాభుడి తమ్ముడైన సునాభుడి బిడ్డలుచంద్రవతి, గుణవతి
  •   చంద్రవతి, గుణవతుల ప్రియులు "గదుడు, సాంభుడు".
  •   వీరి రాయభారి చిలుక.
  •   ఈ ప్రబంధంలో మొత్తం ౫ (5) ఆశ్వాసాలు ఉన్నయి.
  •    ఈ ప్రబంధాన్ని తన తండ్రికి అంకితంగా ఇచ్చాడు.
ఆశ్వాసం
ఆశ్వాసంలోని పద్యాల సంఖ్య
ప్రథమాశ్వాసం
౧౪౮ గద్య పద్యాలు ( 148 )
ద్వితీయాశ్వాసం
౧౧౩ గద్య పద్యాలు ( 113 )
తృతీయాశ్వాసం
౧౫౪ గద్య పద్యాలు ( 154 )
చతుర్థాశ్వాసం
౧౬౪ గద్య పద్యాలు ( 164 )
పంచమాశ్వాసం
౨౨౪ గద్య పద్యాలు ( 224 )
మొత్తం = ౫ ఆశ్వాసాలు ( 5 )
మొత్తం = ౮౦౩ పద్యాలు ( 803 )




తొలి పద్యం

ఉత్పలమాల.



 శ్రీమ దుమా మహేశు లతిచిత్ర విలాసులు తారు మున్ వియో
గామిత చింత నొండొరులకై సగ మౌటలు నిచ్చఁ దెల్పు కాం
క్ష మహిమంబుచేఁ జెటి సగంబుగ నొక్కయెడల్ ధరించు స
  త్ప్రే మపుదంపతుల్ కృతిపతిన్ దనరింతురు గాతఁ గీర్తులన్ “.





చివరి పద్యం

వనమయూరము.
       భ్రుత్యజన పోషణుడు పింగళి పురాంకా
             మాత్యకుల భూషణుడు, మార్దవ మహీయ
           స్సత్యశుచి భాషణుడు, సాధుజనతా సం
               త్యుదయ పోషణుడు వ్యకృప పేర్మిన్ “.